పన్నెండేళ్ల బాలికపై దారుణం

10 Mar, 2019 15:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: అల్వార్‌ పరిధిలోని సూర్యానగర్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటోన్న 12 ఏళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసముంటున్న దశరధ(50) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అల్వాల్‌ పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు