హైదరాబాద్: కూకట్పల్లిలోని ఫార్చూన్ బిజినెస్ స్కూల్ వద్ద రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలతో నడిరోడ్డుపై కొట్టుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. రెండు వర్గాల దాడిలో దారిన పోతున్న ఓ మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు ఎందుకు కొట్టుకుంటున్నారనే విషయం తెలియాల్సి ఉంది.