రాధారవి, శరత్‌కుమార్‌ అరెస్టుకు ఆదేశం

5 May, 2019 05:50 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినీ నటులు రాధారవి, శరత్‌కుమార్‌ల అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రా«ధారవి కార్యదర్శిగా గతంలో ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నటీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు