సాక్షి, విశాఖపట్నం : నగరంలోని ఎంవీపీ డబుల్ రోడ్డులో ప్రముఖ కార్ల కంపెనీ 'హుందాయ్' షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ షోరూంలో విక్రయించే కార్లతో పాటు సర్వీసింగ్కు వచ్చిన కార్లు కూడా ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దాదాపు అరగంట శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. నష్ట తీవ్రత లక్షల్లో ఉండొచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.