ఎస్టీ హాస్టల్లో అగ్నిప్రమాదం

18 Dec, 2018 17:50 IST|Sakshi
కాలిపోయిన పరుపులు

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని ఎస్టీ హాస్టల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యార్థుల పరుపులు, పుస్తకాలు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిపుడు పిల్లలెవరూ హాస్టల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో విద్యుత్‌ సరఫరా లేదు. ఇన్వర్టర్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో హాస్టల్‌ వార్డెన్‌ సత్యనారాయణ కూడా అందుబాటులో లేరు..స్థానికులు గమనించి వెంటనే మంటలు ఆర్పడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు