ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

24 May, 2019 18:19 IST|Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ బిల్డింగ్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు.. విద్యార్థులు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఆరు ఫైర్‌ ఇంజన్లతో దాదాపు 18 మంది రక్షణ చర్యలు చేపట్టారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు