11 ఇళ్లు దగ్ధం: రూ.6 లక్షల నష్టం

25 Dec, 2017 14:25 IST|Sakshi

నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక థామస్‌పేట కాలనీలో అగ్నిప్రమాదం జరిగి 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంతో 11 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

మరిన్ని వార్తలు