వరంగల్‌ ఎంజీఎంలో మంటలు

27 Sep, 2018 08:45 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో షార్ట్‌ సర్క్యుట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రి అద్దాలు పగలగొట్టారు. సిబ్బంది, తల్లిదండ్రుల సాయంతో చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చారు. ఒక్కసారిగి ఆస్పత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బందితో సహా ఆస్పత్రిలోని అన్ని వార్డులోన్ని రోగులు అందరూ  భయటకు పరుగు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు