వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్ట్‌

20 Dec, 2017 17:46 IST|Sakshi

కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని సాయి రామకృష్ణ లాడ్జి పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులతో పాటు లాడ్జి మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతులకు కౌన్సెలింగ్‌ ఇస్తామని చెప్పారు. వ్యభిచారం పై పూర్తి నిఘా ఉందని, ఎప్పటికైనా దీనిని నిర్వహించే వారు  మానుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు