రూ.35 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

29 Jan, 2018 14:40 IST|Sakshi

సాక్షి, బీఎన్‌ కండ్రిగ: ఎర్రచందనం స్మగ్లర్లను బీఎన్ కండ్రిగ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరుజిల్లా పిచ్చాటూరు మండలంలోని అడవుల నుంచి ఎ​ర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుండగా బీఎన్‌ కండ్రిగ పోలీసులు దాడి చేసి ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరినుంచి రూ.35 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను కూడా సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు