విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు..నలుగురి మృతి

8 Feb, 2018 18:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుజరాత్‌లోని బార్వాలా-బోతాడ్‌ హైవే జరిగింది.

 లింబిడి గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై తిరుగుప్రయాణంలో దేవాలయాన్ని దర్శించుకోవడానికి సాలంగపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.గాయపడిన వారిని బోతాడ్‌ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా 20 ఏళ్లలోపు వారే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు