ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

29 Jun, 2018 21:01 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: బెరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌ను టాటా సుమో ఢీకొట్టిన ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. పెట్రోల్‌ ట్యాంక్‌ పేలడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. సుమోలో ప్రయాణిస్తున్న అయిదుగు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు