ఇద్దరితో సహజీవనం చేస్తూ..

14 Oct, 2017 13:34 IST|Sakshi

థానే: మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. ముక్కుపచ్చలారని చిన్నారిని ఓ తల్లి నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. ఆమె చేసిన తప్పు బయట పడుతుందని భావించి అప్పుడే పుట్టిన పసికందును కత్తితో గొంతు కోసి హత్యచేసింది. ఈ సంఘటన థానే జిల్లాలోని డోంబివ్లిలో మూడు రోజుల క్రితం జరగగా పోలీసులు శనివారం పాలు పంచుకున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. స్థానికంగా నివాసముంటున్న 20 ఏళ్ల యువతి ఇద్దరు యువకులతో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. విషయం తన తల్లికి చెప్పి ఆమె సాయంతో గర్భస్రావం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లింది. అయితే గర్భస్రావం చేస్తే ప్రమాదమని వైద్యులు తెలపడంతో దిక్కుతోచక ఇంటికి చేరింది. ఈ క్రమంలో ఈ నెల 9న యువతి పండంటి బాబుకు జన్మనిచ్చింది.

అనంతరం ఏం చేయాలో పాలుపోని యువతి తల్లితో పాటు తనతో సహజీవనం చేస్తున్న ఇద్దరు యువకుల సాయంతో చిన్నారి గొంతు కోసి హత్య చేసింది. చిన్నారి మృతదేహాన్ని కవర్‌లో కట్టి బిల్డింగ్‌ పై నుంచి కిందకు పడేసింది. బిల్డింగ్‌ సమీపంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తీగ లాగితే డొంక కదిలింది. బిల్డింగ్‌లోని గర్భిణీ స్ర్తీల వివరాలు కనుక్కోవడంతో పోలీసులు నిందితులను సునాయసంగా పట్టుకోగలిగారు. యువతితో పాటు ఆమె తల్లి శాంతా బెనర్జీ(45), సహజీవనం చేస్తున్న కమలేష్‌(29), మహేష్‌(24)లను పోలీసులు ఈ రోజు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు