కాబూల్‌లో ఆత్మాహతి దాడి..ఏడుగురి మృతి

25 Dec, 2017 10:42 IST|Sakshi

కాబూల్‌ : షాష్‌ దారక్‌ ప్రాంతంలోని నేషనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ సబ్‌ ఆఫీసు వద్ద పేలుడు సంభవించింది. ఛాతీకి పేలుడు పదార్ధాలు అమర్చుకుని వచ్చిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో  ఉగ్రవాదితో పాటు మరో ఏడుగురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7.20 గంటలకు జరిగింది. ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ఈ ఘటనకు తాము బాధ్యులుగా ప్రకటించుకోలేదు. 

మరిన్ని వార్తలు