రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

11 Dec, 2019 09:24 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవాను లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా... మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. పొద్దుటూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటికి చెందిన అర్షద్‌, హజీరా, చిత్తూరు జిల్లాకు చెందిన హరుణ్‌ బాషా, అఫిరాలు మృత్యువాతపడ్డారు. హజీరా, అర్షద్‌లు రాయచోటికి చెందిన స్టార్‌ పైపుల షాపు యజమాని కూతురు, అల్లుడు అని సమాచారం.    

మరిన్ని వార్తలు