స్నేహితులే అతని పాలిట కాలయములయ్యారు

2 Jun, 2019 08:46 IST|Sakshi
క్రైమ్‌ న్యూస్‌, ఉప్పల్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఓ యువకుని పాలిట అతని స్నేహితులే కాలయములయ్యారు. రాళ్లతో, కర్రలతో అతన్ని దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణమైన ఘటన ఉప్పల్‌ రామంతపూర్‌లోని కేసీఆర్‌ నగర్‌లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రసాద్‌(26) అనే యువకునిపై అతని స్నేహితులు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్‌ మృతిచెందారు. అనంతరం నిందుతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్నేహితుల మధ్య అంతర్గత కక్షలే ఈ హత్యకు దారితీయవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రసాద్‌ను హతమార్చడంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు