‘దిశ హత్య ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

26 Dec, 2019 20:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల చోటుచేసుకున్న దిశ హత్య  జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గచ్చిబౌలి వాని నగర్‌ ప్రాంత వాసులు హెచ్‌ఆర్‌సీ(మానవ హక్కుల కమిషన్‌)కి పిటిషన్‌ దాఖలు చేశారు. రాత్రి సమయంలో ఈ ప్రాంత నుంచి వెళ్లలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, సైబరాబాద్‌ సీపీలకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు