బాలిక కిడ్నాప్‌

14 Aug, 2019 12:30 IST|Sakshi
సీసీ కెమెరా పుటేజీలో నిందితుడు , ఫాతిమా(ఫైల్‌)

రాంగోపాల్‌పేట్‌: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సంఘటన మంగళవారం రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాప్రాల్‌ భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజు బాలంరాయిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య హజీరా, కుమార్తె ఫాతిమా(5), కుమారుడు రమేష్‌ (4) కుమార్తె మౌనిక(3) ఉన్నారు. మంగళవారం ఫాతిమకు జ్వరం రావడంతో నీలోఫర్‌ ఆస్పత్రికి ళ్లేందుకు భార్య పిల్లలతో కలిసి యాప్రాల్‌ నుంచి వచ్చిన అతను ప్యాట్నీ సెంటర్‌లో బస్సు దిగాడు. మరో బస్సు ఎక్కేందుకు జేమ్స్‌ స్ట్రీట్‌కు నడిచి వెళుతుండగా పార్క్‌లేన్‌ సమీపంలో గతంలో రాజుతో పాటు పేపర్లు ఏరుకునే వ్యక్తి అతడిని గుర్తుపట్టి  పలకరించాడు. అందరూ కలిసి టీ తాగారు. చిన్న పాపకు పాల కోసం నల్లగుట్టకు వెళుతుండగా అతను కూడా వారితో పాటు వెళ్లాడు. నల్లగుట్ట సూరత్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సమీపంలో బ్యాగులు పెట్టిన రాజు,హజీరా పాపకు పాలు తీసుకుని వస్తామని ఫాతిమాను చూస్తూ ఉండమని చెప్పి వెళ్లారు. వారు వెళ్లి తిరిగి వచ్చేలోగా సదరు యువకుడు పాపతో పాటు ఉడాయించాడు. వారి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు