చిన్నారిని కాటేసిన కరెంటు

9 May, 2018 11:13 IST|Sakshi
అబిజ్‌ఇండియా(ఫైల్‌)

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌) : విద్యుదాఘాతం తో చిన్నారి మృతి చెందిన సంఘటన మంచిర్యాల లోని పెంచికల్‌పేట్‌ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్‌ సుభాన్‌-కల్పన దంపతులకు ఇద్దరు సంతానం. ఎల్కపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్‌ పాఠశాల నడుపుతూ అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. వీరికి కుమార్తె అబీజ్‌ఇండియా(11), కుమారుడు అకీర్‌ఇండియా ఉన్నారు.

మంగళవారం ఉదయం ఇంటి సమీపంలో అమర్చిన కూలర్‌ను అబీజ్‌ఇండియా తాకడంతో విద్యుత్‌షాక్‌కు గురైంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మెరుగైన వైద్యం నిమిత్తం తన సొంత వాహనంలో కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. బాలిక తండ్రి కాగజ్‌నగర్‌ మండలంలోని బోడెపెల్లి వీఆర్‌వోగా పనిచేస్తుండగా తల్లి స్థానికంగా ప్రైవేట్‌ పాఠశాల నిర్వహణ చూస్తోంది. మృతదేహాన్ని పంచనామా కోసం సిర్పూ ర్‌(టి) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 

మరిన్ని వార్తలు