మహిళా టీచర్‌తో ఎఫైర్‌.. తల్లిని చంపేసిన కూతురు!

12 Mar, 2018 16:31 IST|Sakshi

ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. మహిళా ఉపాధ్యాయురాలితో సంబంధాన్ని నిలదీసినందుకు కన్నతల్లిని కడతేర్చిందో కిరాతకురాలు. ఈ ఘటనలో 18 ఏళ్ల అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఘజియాబాద్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి(18) తన కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి (35)తో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వద్దని వారించారు. ఒకటిరెండుసార్లు కూతురిని మందలించారు. అయినా.. వెనకకు తగ్గని ఆ అమ్మాయి కొన్ని నెలల కిందట ఇంటి నుంచి పారిపోయి.. ఆ టీచర్‌తో కలిసి సహజీవనం చేసింది. దీంతో కూతురిని గుర్తించి బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. టీచర్‌తో తన అనుబంధాన్ని తల్లి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపం పెంచుకున్న యువతి.. ఈ నెల 9వ తేదీన.. ఇంట్లో ఎవరులేని సమయంలో తల్లిపై కర్రలు, ఇనుపచువ్వలతో దాడి చేసింది.

కన్నతల్లి అన్న కనికరం చూపకుండా తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కూతురే చంపేసిందని, టీచర్‌తో లైంగిక సంబంధాన్ని కాదన్నందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న ఘజియాబాద్‌ కవినగర్‌ పోలీసులు.. నిందితురాలిని అరెస్టు చేశారు. టీచర్‌పై కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను కూడా విచారించాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు