ముజఫర్నగర్ : ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ముజఫర్నగర్కు సమీపంలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై తుపాకీ గురిపెట్టి ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక చేతి పంపు నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. బాలికను ఓ ఇంటికి తీసుకువెళ్లిన ముగ్గురు యువకులు ఆమెపై తుపాకీ గురిపెట్టి దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాధితురాలిని బెదిరించారు.
నిందితులు లైంగిక దాడి ఘటనను వీడియో తీశారని స్ధానిక సీఐ రాజీవ్ కుమార్ సింగ్ చెప్పారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులపై పోస్కో చట్టం కింద అభియోగాలు నమోదు చేశామని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.