అపహరణకు గురైన చిన్నారి

2 Aug, 2018 21:03 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలోని నందిపేట్‌ మండల కేంద్రంలో ఓ పాప అపహరణకు గురైంది. ప్రైవేట్‌ పాఠశాల నుంచి ఓ మహిళ వచ్చి ఆ పాపను తీసుకెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపింది. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూల్‌ సిబ్బందిని విచారించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ ఏవరో తెలియదని, ఆమె వచ్చి పాపను తీసుకెళ్లిందని సిబ్బంది తెలపగా.. ఆ గుర్తు తెలియని మహిళ ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు