ఎయిర్‌పోర్టులో తనిఖీలు: పట్టుబడిన బంగారం

6 Jan, 2018 14:08 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారం బయటపడింది. పట్టుబడిన బంగారం సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని అతనిని విచారణ చేపడుతున్నారు. దొరికిన బంగారం రూ. 11.65 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు