ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

7 Jun, 2019 11:05 IST|Sakshi
ఉపాధ్యాయుడిని కొడుతున్న మహిళలు

 విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన

కర్ణాటక, బాగేపల్లి : విద్యార్థులకు నీతి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు క్రమశిక్షణ తప్పాడు. పాఠశాలోనే ఓ మైనర్‌ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో స్థానికులు సదరు ఉపాధ్యాయుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు... తాలూకాలోని పరగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బాబు, ఇదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక పట్ల లైంగికంగా వేధించాడు. దీంతో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. గురువారం ఉదయం వారు పాఠశాలకు వచ్చి విచారణ చేసి ఉపాధ్యాయుడిని పట్టుకుని స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగతించారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు