దారుణం: పసికందు నోట్లో వడ్లగింజలు వేసి..

9 Sep, 2019 14:46 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండవ కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందనే కోపంతో పసికందు నోట్లో వడ్ల గింజలు వేసి హత్య చేశాడో కసాయి తాత. రాయపర్తి మండలం ఎర్రగట్టుతండాలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయపర్తి మండలం కేశవపురం శివారు ఎర్రగట్టుతండాకు చెందిన భుక్య మమత, తిరుపతి దంపతులకు ఈ నెల 4వ తేదీన ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే అంతకు ముందే వారికి ఓ ఆడపిల్ల ఉండటం, మళ్లీ రెండవ కాన్పులో సైతం  ఆడపిల్ల పుట్టటంతో పసికందు తాత బీచ్యు ఆగ్రహానికి గురయ్యాడు.

ఆదివారం రాత్రి రెండవ కాన్పులో పుట్టిన పసికందు నోట్లో వడ్ల గింజలు వేసి  హత్య చేశాడు. అనంతరం  ఇంటికి దగ్గరలోని స్థలంలో పాతి పెట్టాడు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు, వరంగల్ రూరల్  జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్‌రెడ్డి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు అధికారులు సోమవారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని, పాప మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు