మరికాసేపట్లో గ్రూప్‌-2 ఎగ్జామ్‌.. విద్యార్థిని మృతి

5 May, 2019 09:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  జిల్లాలోని చీడికాడ మండలం ఖండివరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో విద్యుత్‌ షాక్‌తో గ్రూప్‌-2 విద్యార్థిని కోమలి మృతి చెందింది. పరీక్ష రాసేందుకు ఆటోనగర్‌లో ఉన్న తండ్రి వద్దకు విద్యార్థిని వచ్చింది. మరికాసేపట్లో ఏపీ గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష జగరనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కోసం పూర్తిస్థాయిలో ప్రిపేర్‌ అయి.. సిద్ధంగా ఉన్న కోమలి ఆకస్మికంగా మరణించడంతో ఖండివరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు