అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి

13 Sep, 2018 11:50 IST|Sakshi

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మరో సారి కాల్పులతో దద్ధరిల్లింది. గుర్తుతెలియన దుండగుడు తుపాకితో  విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ఐదుగురు అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం తనకు తానుగా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ దుర్ఘటన కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌లో బుధవారం చోటు చేసుకుంది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నిందితుడి భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. 

తొలుత బేకర్స్‌ఫీల్డ్‌లోని ట్రక్కింగ్ కంపెనీ ప్రాంగణంలో తన భార్యతో పాటు మరో వ్యక్తిని కాల్చి చంపాడు. ఆ తరువాత మరో వ్యక్తిని వెంబడించి స్పోర్ట్స్ స్టోర్ సమీపంలో కాల్చి చంపాడు. తన నివాసంలో మరో ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల తుపాకిని స్వాధీనం చేసుకుని మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. నిందితుని వివరాలను పోలీసులు  వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు