భయంకరంగా టీటీడీ ఉద్యోగి వీరంగం.. వైరల్‌

23 Apr, 2018 14:34 IST|Sakshi

సాక్షి, తిరుపతి: పవిత్రమైన ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు.. పూటుగా మద్యం సేవించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ రోడ్లపై వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే... తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వాహన బేరర్‌గా పనిచేస్తున్న కుమార్‌.. ఆదివారం రాత్రి జనంపై దౌర్జన్యానికి దిగాడు. దుకాణాల్లోని కూరగాయలు, వస్తువులను రోడ్డుపైకి విసిరేశాడు. అటుగా వెళ్లే వాహనదారులపై దాడికి యత్నించాడు. అడ్డం వచ్చిన కానస్టేబుల్‌పైనా దౌర్జన్యం చేశాడు. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ, నిలిపిఉంచిన ద్విచక్రవాహనాలను ఎత్తిపడేసే యత్నం చేశాడు. వీడియో కెమెరాలకు చిక్కిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

టీటీడీ అధికారులకు సమాచారం: విచ్చలవిడిగా ప్రవర్తించిన కుమార్‌ను దాదాపు అరగంట తర్వాత పోలీసులు పట్టుకున్నారు. తెలిసినవారి ద్వారా కుమార్‌ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతని కుటుంబీకులను పిలిపించారు. ఉద్యోగి వ్యవహారంపై టీటీడీ అధికారులకు సైతం సమాచారం అందించినట్లు తెలిసింది. కుమార్‌పై టీటీడీ చర్యలు తీసుకుంటుదా, లేదా తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు