గణేష్‌ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుడి పాడుబుద్ధి..

5 Sep, 2019 09:05 IST|Sakshi

భువనేశ్వర్‌ : గణేష్‌ వేడుకల సందర్భంగా పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్ధినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాడుబుద్ధి ప్రదర్శించిన ప్రధానోపాధ్యాయుడు అదృశ్యమయ్యారు. ఈనెల 2న స్ధానిక ప్రాధమికోన్నత పాఠశాలలో గణేష్‌ చతుర్ధి వేడుకలు జరుగుతుండగా ఎనిమిదో తరగతి చదివే విద్యార్ధినిని అక్కడే ఉన్న హెడ్‌మాస్టర్‌ లైంగికంగా వేధించారని, బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి నిందితుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలుసుకున్న తర్వాత పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. బాలికను వేధించిన హెడ్మాస్టర్‌పై పోక్సో సహా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు