ఇల్లు దగ్ధం.. మహిళ సజీవ దహనం

27 Jan, 2018 09:09 IST|Sakshi
సజీవ దహనం అయిన మహిళ

సాక్షి, అనంతపురం రూరల్‌: అనంతపురం నగరంలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఇందిరానగర్‌లో గుడిసెకు నిప్పంటుకుని ఓ మహిళ సజీవ దహనం అయింది. మృతురాలిని ఒంటరి మహిళ రజియాబీగా గుర్తించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు