భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

16 Sep, 2019 10:39 IST|Sakshi
రెడ్డి మహేష్‌ (ఫైల్‌)

చిత్తూరు,పుంగనూరు : భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పుంగనూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్ద గల శాంతినగర్‌లో రెడ్డి మహేష్‌(35), రెడ్డి లీలావతి నివాసం ఉన్నారు. వీరికి ఒక కుమారై. కుటుంబ కలహాలతో లీలావతి భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. పలు మార్లు పంచాయతీలు నిర్వహించినా ఆమె కాపురానికి రాకపోవడంతో భర్త మహేష్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ముని రత్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

మరిన్ని వార్తలు