భార్యపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

16 Feb, 2019 22:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి: షాద్‌నగర్‌ పట్టణంలోని నెహ్రూనగర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికంగా నివాసముంటున్న అర్మన్‌, మూసుఖాన్‌లు దంపతులు. భార్యాభర్తల మధ్య ఓ విషయంలో వివాదం చెలరేగడంతో కోపంలో భార్యపై భర్త అర్మన్‌ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య మూసుఖాన్‌ తీవ్రంగా గాయపడింది. భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు