రంగారెడ్డి: షాద్నగర్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికంగా నివాసముంటున్న అర్మన్, మూసుఖాన్లు దంపతులు. భార్యాభర్తల మధ్య ఓ విషయంలో వివాదం చెలరేగడంతో కోపంలో భార్యపై భర్త అర్మన్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య మూసుఖాన్ తీవ్రంగా గాయపడింది. భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.