భార్య టీ పెట్టి ఇవ్వ లేదని..

18 Nov, 2019 07:39 IST|Sakshi

క్వారీ గుంతలో పడి వ్యక్తి ఆత్మహత్య

జగద్గిరిగుట్ట: భార్య టీ పెట్టి ఇవ్వలేదని గొడవ పడిన భర్త క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలయ్యనగర్‌కు చెందిన అడివయ్య (35) ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆదివారం ఉదయం టీ పెట్టివ్వాలని భార్య జ్యోతిని కోరగా ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో భార్యతో గొడవ పడిన అడివయ్య పక్కనే ఉన్న క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు