మూడో పెళ్లికోసం పచ్చి బాలింతరాలిని..

14 Jan, 2019 17:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  బోరబండలో దారుణం జరిగింది. మూడో పెళ్లి కోసం ఇద్దరు భార్యలను వేధించాడు ఓ భర్త. తాను మూడో పెళ్లి చేసుకునేందుకు అనుమతి పత్రంపై సంతకం చేయాలంటూ తన భార్యలిద్దరిపై ఒత్తిడి తెచ్చాడు. సంతకం చేయమని చెప్పడంతో పచ్చి బాలింతరాలని కూడా కనికరం లేకుండా రెండో భార్యను బెల్టుతో చావబాదాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి భర్తపై ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు