భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త

5 Aug, 2019 08:24 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను రాడ్‌తో దారుణంగా కొట్టి చంపాడో భర్త. వికారాబాద్‌ పట్టణంలోని మోతిలాల్‌ కాలనీకి చెందిన ప్రవీణ్‌ అదే ప్రాంతానికి చెందిన చాందినీని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆయాన్‌(10), కూతురు ఏంజిల్‌(5) ఉన్నారు. ఆదివారం రాత్రి భార్య చాందినికి, ప్రవీణ్‌లకు మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి తర్వాత భార్య, ఇద్దరు పిల్లలను రాడ్‌తో కొట్టి చంపాడు. హత్యానంతరం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు