భర్త చేతిలో భార్య హతం

12 Oct, 2019 12:52 IST|Sakshi
భార్య నౌషిదా బేగం

నిందితుడు పోలీస్‌ కానిస్టేబుల్‌

అంబర్‌పేట: ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.  ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు టౌన్‌కు చెందిన అబ్డుల్‌ రషీద్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ భార్య నౌషిదా బేగం(23) కుమార్తె, కుమారితో కలిసి ఏడాదిగా అంబర్‌పేట అజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో నౌషిదా అతడిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. గత కొంతకాలంగా నౌషిదా అనుమానం పెంచుకున్న రషీద్‌ తరచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వారి మధ్య గొడవ జరగడంతో ఇంటి యాజమాని సలీం వారికి సర్ధిచెప్పాడు. అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే రషీద్‌ ఆమెపై రాడ్డు దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఇంటి యాజమాని సలీం సమాచారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  నౌషిదా బేగం మృత దేహా న్ని స్వాధీనం చేసుకుని  ఉస్మానియా అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రషీద్‌ అంబర్‌పేట పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు