‘గత్యంతరం లేకే నా భార్యను చంపేశా’

13 Feb, 2019 10:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భార్యపై అనుమానంతో దుబాయ్‌ నుంచి వచ్చి మరీ హత్య చేశాడో భర్త. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గద్వాల్‌కు చెందిన రహీం ఉపాధి కోసం దుబాయ్‌కి వలస వెళ్లాడు. అయితే తన మొదటి భార్య బేగం ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతోందని, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రహీం అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఫోన్‌లో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో పక్కా ప్లాన్‌ ప్రకారం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రహీం.. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జ్‌లో దిగాడు. 

అనంతరం భార్యకు ఫోన్‌ చేసి గద్వాల్‌ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు రమ్మన్నాడు. ఆమెను లాడ్జ్‌కు తీసుకెళ్లి ఈ విషయమై చర్చించారు. ఇద్దరి మధ్య దీనిపై పెద్ద గొడవే జరిగిందని సమాచారం. కోపోద్రిక్తుడైన రహీం అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. అనంతరం గత్యంతరం లేకే తన భార్యను చంపినట్టు 100కు ఫోన్‌ చేసి పోలీసులకు చెప్పాడు. పోలీసులు లాడ్జ్‌కు వచ్చేంతవరకు వేచివున్న అతడు వాళ్లు వచ్చిన వెంటనే పరారయ్యాడు. మృతురాలి వివరాలు సేకరించిన పోలీసులు ఆమె బంధువులకు సమాచారమిచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు