మర్రిగూడలో దారుణం

10 Oct, 2018 07:20 IST|Sakshi
మృతురాలు భూతం నర్సమ్మ

మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్యపాలిట భర్తే యముడయ్యాడు. నిద్రపోతున్న భార్య భూతం నర్సమ్మ(40)ను భర్త భూతం యాదయ్య(46) గొడ్డలితో నరికి చంపాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన అనంతరం భర్త పరారయ్యాడు. వీరికి ఇద్దరు సంతానం. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు