భయంకర ఘటన.. భార్య ప్రియుడిని చెట్టుకు కట్టేసి..!

24 Nov, 2017 15:07 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్నందుకు ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి.. అత్యంత కిరాతకంగా కొట్టిచంపారు. వివాహతను కూడా చెట్టుకు కట్టేసి.. అమానుషంగా కొట్టారు. యాదగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

నిర్మలనే అనే వివాహిత ఒక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆ వ్యక్తిపై ఆమె భర్త, స్నేహితులు దాడి చేశారు. అతని దుస్తులు ఊడదీసి.. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆమెను కూడా చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాలతో వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు