వివాహేతర సంబంధం..వ్యక్తి దారుణ హత్య

26 Mar, 2018 06:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్నూలు జిల్లా: గోస్పాడు మండలం యళ్లూరు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డె సంజీవ కర్ణ (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఒంటరిగా వెళ్తున్న సమయంలో కత్తులతో పొడిచి చంపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చు అని గోస్పాడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు