-
విడాకుల నోటిసు పంపిన భర్త
లక్నో : సొంత వదిననే అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. బాధితురాలికి మద్దతుగా నిలవాల్సిన ఆమె భర్త విడాకుల నోటీసులు పంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్, ముజఫర్నగర్ సమీపంలోని ధండేడా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక మసీదు ఇమామ్ భార్యను అతని సోదరుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారం చేశాడని, ఆమె అంగీకరించక పోవడంతో చితకబాది మరి లోబరుచుకున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు తెలిపారు.
బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపామన్నారు. ఇక బాధితురాలి భర్త విడాకులు కోరుతూ నోటీసులు పంపించారని, గతేడాదే వీరికి పెళ్లైందని పోలీసులు పేర్కొన్నారు.