భువనేశ్వర్ : బాలాసోర్ జిల్లాలో గురువారం రాత్రి హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పాలిథీన్ కవర్లో ఓ శిశువు మృతదేహం దర్శనమిచ్చింది. పట్టణంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఓ శునకం చిన్నారి మృతదేహం పీక్కుతింటుండగా.. కొందరు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.