విద్యార్థిని మనస్తాపం.. ఆత్మహత్య..!

15 Jul, 2018 15:23 IST|Sakshi

సాక్షి, కడప : ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండలం బక్కన్నగారి పల్లెలో ఆదివారం చోటుచేసకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాలివి.. సింధూ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోందని సమాచారం. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యిందనే మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు