విద్యార్థిని ఆత్మహత్య

18 Aug, 2018 10:31 IST|Sakshi
నాగప్రసన్నలక్ష్మి (ఫైల్‌)

హస్తినాపురం (హైదరాబాద్‌): ఇంటర్‌ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, అర్ధవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి సచివాలయనగర్‌లో ఉంటూ ఆటోనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె నాగసాయి ప్రసన్నలక్ష్మీ(17) పనామా గోడౌన్స్‌ సమీపంలోని శ్రీగాయత్రి కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది.

శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది, తండ్రి  ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు