విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారం

3 Dec, 2018 19:49 IST|Sakshi

సాక్షి,  ప్రకాశం: మహిళలపై లైంగిక అకృత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినిపై తొమ్మిది మంది యువకులు ఏడాది కాలంగా  లైగికంగా హింసిస్తూ, పలుమార్లు అత్యాచారం జరిపారు.

ఈ దుర్మార్గంపై బాధితురాలు ఆదివారం గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎస్‌పీ ఎన్వీ రామాంజనేయులు విలేకరులకు తెలిపారు.

మరిన్ని వార్తలు