కత్తులు, మరణాయుధాలతో బెదించించి చోరీ

11 Feb, 2020 10:50 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఉయ్యూరు మండలంలో అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా కలకం సృష్టించింది. మంగళవారం ఓ ఇంట్లోకి చొరబడి మరణాయుధాలతో బెదించించి చోరీకి పాల్పడిన ఘటన కాటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఒక​ ఇంట్లో చోరికి ప్రణాళికతో వచ్చిన దొంగ మరో ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న సీపీ తిరుమలరావు బాధితుడు ఆరేపల్లి రజినిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో దుండగులు ఒరిస్సా భాషలో మాట్లాడినట్లు బాధితుడు తెలిపాడు. కాగా క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు