బెయిల్‌పై ఈశాన్యరెడ్డి విడుదల

25 Apr, 2018 08:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఈశాన్యరెడ్డికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. కుషాయిగూడ డీఏఈ కాలనీలో ఆదివారం రాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై కారు ఎక్కించి అతని మృతికి కారణమైన ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఈశాన్యరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్‌ రావడంతో జైలు నుంచి విడుదలైంది.

మరిన్ని వార్తలు