రాయచోటిటౌన్ : రాయచోటిలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. గురువారం రాత్రి నుంచి ఆకస్మికంగా దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు రెండు బృందాలు వేర్వేరుగా పట్టణంలోని రవితేజ హాస్పిటల్, అమీన్ హాస్పిటల్లలో రికార్డులు తనిఖీ చేశారు. తరువాత మెడికల్ షాపులలోని రికార్డులను స్వాధీనం శుక్రవారం తెల్లవారే వరకు తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు స్వాధీనం చేసుకొని జిల్లా కేంద్రానికి వెళ్లిపోయారు. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అధికారులు తెలిపారు. ఈతనిఖీ అధికారులలో ఎండీ రమణయ్య, వెంకటరమణ ఉన్నారు.