మాగుంట బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు

8 Dec, 2018 11:56 IST|Sakshi

సాక్షి, చెన్నై : నగరంలోని మాగుంట బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీనగర్‌లోని కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు తనఖీలు జరిపారు. సవేరా హోటల్‌లో భారీగా నగదు, బంగారం లభ్యమైంది. ఇందుకు అనుగుణంగా అధికారులు తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు లెక్కకురాని 55 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు