బరితెగించిన జనసేన కార్యకర్తలు

13 Mar, 2020 12:31 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బత్తయ్య

సాక్షి, చిత్తూరు : శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు బరితెగించారు. ఓ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారు. శుక్రవారం తొట్టంబేడు మండలం చిప్పలకు చెందిన బత్తయ్య అనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై జనసేన కార్యకర్తలు కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన బత్తయ్యకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగుల్లో పడి ఉన్న బత్తయ్యను ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం బత్తయ్యను చంపుతామని హెచ్చరించిన జనసేన కార్యకర్తలు ఈ రోజు పథకం ప్రకారం దాడికి చేశారు. ( ఇది ఫెవికాల్‌ బంధం )

చదవండి : కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం

మరిన్ని వార్తలు